దేశంలో కొత్తగా 16,764 క‌రోనా కేసులు

మొత్తం 1,270 ఒమిక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 13,154 కేసులు న‌మోదుకాగా, నిన్న 16,764 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి నిన్న‌ 7,585 మంది కోలుకున్నారు. క‌రోనా కార‌ణంగా నిన్న‌ 220 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

ప్ర‌స్తుతం 91,361 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. రిక‌వ‌రీ రేటు 98.36 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,270 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ‌లో 62, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 16 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని వివ‌రించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/