దేశంలో కొత్తగా 16,464 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 1,43,989
న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,464 మందికి వైరస్ నిర్ధరణ కాగా.. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 16,112 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది. భారత్లో ఆదివారం 8,34,167 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.34 కోట్లు దాటింది. మరో 2,73,888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 5,79,258 మంది వైరస్ బారినపడగా.. మరో 816 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,20,96,907కు చేరింది. ఇప్పటివరకు వైరస్తో 64,19,731 మంది మరణించారు. ఒక్కరోజే 6,55,167 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,21,65,705కు చేరింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/