తెలంగాణలో కొత్తగా 1,637 కేసులు నమోదు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,143..మొత్తం మృతుల సంఖ్య 1,357

telangana-corona virus

హైదరాబాద్: ‌ తెలంగాణలో కొత్తగా కరోనా కేసుల వివరాలను ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,637 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,273 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,44,143 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,357 కి చేరింది. ప్రస్తుతం 18,100 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,335 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 136 కేసులు నిర్ధారణ అయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/