దేశంలో కొత్తగా 16,159 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు..1,15,212
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 16,159 మంది వైరస్ బారినపడగా.. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు పైగా పెరిగింది. కొవిడ్ నుంచి 15,394 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.56శాతానికి పెరిగింది. భారత్లో సోమవారం 9,95,810 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,20,86,763కు చేరింది. మరో 4,54,465 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/