దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 1,13,864

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,135 మంది వైరస్​ బారినపడగా.. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 13,958 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.85శాతానికి ఎగబాకింది.భారత్​లో ఆదివారం 1,78,383 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,98,21,197కు చేరింది. మరో 3,32,978 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,36,614 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 566 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,43,43,968కు చేరింది. మరణాల సంఖ్య 63,61,372 చేరింది. ఒక్కరోజే 485,179 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 529,190,953కు చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/