తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,124..మొత్తం మృతుల సంఖ్య 1,287

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,579 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,811 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,26,124 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,04,388 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,287 కి చేరింది. ప్రస్తుతం 20,449 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,071 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 102 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/