తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,682..మొత్తం మృతుల సంఖ్య 1362

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసుల వివరాలను ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,539 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 978 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,682 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,25,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1362కి చేరింది. ప్రస్తుతం 18,656 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,864 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 285 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 123 కేసులు నిర్ధారణ అయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/