తెలంగాణలో కొత్తగా 1,536 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,42,506..మొత్తం మృతుల సంఖ్య 1,351

Corona cases in Telangana
Corona cases in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,536 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,421 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,42,506 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,23,413 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,351 కి చేరింది. ప్రస్తుతం 17,742 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,915 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 281 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 92 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/