భారత్‌లో కొత్తగా 15,223 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,10,883..మొత్తం మృతుల సంఖ్య 1,52,869

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 15,223 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 19,965 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,10,883కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 151 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,869కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,65,706 మంది కోలుకున్నారు. 1,92,308 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 8,06,484 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,93,47,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,80,835 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/