తెలంగాణలో కొత్తగా 152 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739..మొత్తం మృతుల సంఖ్య 1,602

హైదాబాద్‌: తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 221 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,91,115 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,602 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,022 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 659 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/