తెలంగాణాలో కొత్తగా 152 పాజిటివ్ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,406 .. మొత్తం మృతుల సంఖ్య 1,637

హైదరాబాద్: తెలంగాణలో కొత్త‌గా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనా వల్ల ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 114 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,406 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,821 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,637గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,948 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 835 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 25 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/