భారత్‌లో 24 గంటల్లో 14,933 కొత్త కేసులు

కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,40,215

corona cases- india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 14,933 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 312 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,40,215కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 14,011కి పెరిగింది. 1,78,014 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,48,190 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ వివరాలను తెలిపింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/