దేశంలో కొత్తగా 14,917 కరోనా కేసులు

corona virus -india

న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో కొత్తగా 14,917 కరోనా కేసులు నమోదవగా, 32 మంది బాధితులు మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,42,68,381కి చేరగా, 5,27,069 మంది కరోనాకు బలయ్యారు. ఇందులో 4,36,23,804 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, మరో 1,17,508 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 14,238 మంది కరోనా నుంచి బయటపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.52 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతంగా ఉందని, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 208.25 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/