తెలంగాణలో కొత్తగా 148 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,950..మొత్తం మృతుల సంఖ్య 1,620

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 150 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,950కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,690 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,620 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,640 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 641 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 26 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/