దేశంలో కొత్తగా 14,506 కరోనా కేసులు
యాక్టివ్ కేసులు.. 99,602
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14,506 మంది వైరస్ బారినపడగా.. మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.23 శాతం వద్ద ఉంది.
భారత్లో మంగళవారం 13,44,788 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,46,57,138 కోట్లకు చేరింది. మరో 4,33,659 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 688,426 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,326 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,353,574కు చేరింది. ఒక్కరోజే 657,755 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 526,246,203గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/