తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,38,632..మొత్తం మృతుల సంఖ్య మొత్తం 1,336

corona virus-telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,445 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,486 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,38,632 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,18,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,336 కి చేరింది. ప్రస్తుతం 18,409 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,439 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 286 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 107 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/