దేశంలో కొత్త‌గా 14,348 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 14,348 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా నుంచి నిన్న‌ 13,198 మంది కోలుకున్నారు. అలాగే, నిన్న‌ 805 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య మొత్తం 3,42,46,157కు చేరింది. యాక్టివ్ కేసులు 1,61,334 ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,36,27,632 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,57,191గా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,04,82,00,966 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న 7,838 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న‌ 90 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/