వందేభారత్.. గన్నవరం చేరుకున్న 143 మంది భారతీయులు
లండన్ నుండి వచ్చిన 143 మంది భారతీయులు..విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు
విజయవాడ: కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాలల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ‘వందేభారత్’ మిషన్ తో స్వదేశానికి తీసుకోస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వందేభారత్ మిషన్2లో భాగంగా ఈ ఉదయం 143 మంది ప్రవాసీయులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులోనే వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు అనంతరం క్వారంటైన్ కేంద్రాలకు తరలించనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా ఆ జిల్లా కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ వారి స్తోమతను బట్టి పెయిడ్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు. కాగా శనివారం ప్రారంభమైన రెండో విడతలో భాగంగా మరిన్ని దేశాల నుంచి భారతీయులను తరలిస్తోంది. ఈ నెల 22 వరకు రెండో దశ కొనసాగనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/