భారత్లో కొత్తగా 13 వేల కేసులు నమోదు
న్యూఢిల్లీ: భారత్ కరోనా మహమ్మారి నుండి క్రమంగా కుదుటపడుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 2,08,012 కేసులు యాక్టివ్గా ఉండగా, 1,02,11,342 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,52,419 మంది మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు కొత్తగా 14,457 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ వల్ల మరో 145 మంది మృతిచెందారని వెల్లడించింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/