దేశంలో కొత్త‌గా 13,451 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 13,451 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే, నిన్న‌ 14,021 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో 585 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,42,15,653కు చేరింది.

యాక్టివ్ కేసుల సంఖ్య‌ 1,62,661గా ఉంది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,35,97,339 మంది కోలుకున్నారు. మొత్తం 4,55,653 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. నిన్న 55,89,124 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 103,53,25,577 డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించారు. కేర‌ళ‌లో నిన్న‌ 7,163 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 90 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/