తెలంగాణలో కొత్తగా 1,335 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,00,611..మొత్తం మృతుల సంఖ్య 1,171

telangana-corona virus

హైదరాబాద్‌: తెలంగాణ కొత్తగా 1,335 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,176 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,00,611 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,72,388 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,171కు చేరింది. ప్రస్తుతం 27,052 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 262, రంగారెడ్డి జిల్లాలో 137 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/