భారత్‌లో 24 గంటల్లో 12,881 కొత్త కేసులు

మొత్తం మృతుల సంఖ్య 12,237..మొత్తం కేసులు 3,66,946

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 12,881 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 334 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,66,946కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 12,237కి పెరిగింది. 1,60,384 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,94,325 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడిచింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/