దేశంలో కొత్తగా 1,270 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,859

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో 4,32,389 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… కొత్తగా 1,270 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా తగ్గింది. ముందు రోజు 149 మంది కరోనా కారణంగా మృతి చెందగా… గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి 1,567 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,859గా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 183 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న ఒక్క రోజే 4,20,842 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,24,83,829 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/