తెలంగాణలో 1,256 కొత్తగా పాజిటివ్ కేసులు
మొత్తం కేసుల సంఖ్య 80,751
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,256 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,587 మంది కోలుకోగా, 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఆసుపత్రుల్లో 22,528 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 57,586 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 637కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 389 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు నమోదయ్యాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/