దేశంలో కొత్తగా 1,225 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,307

న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,225 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,594 మంది కరోనా నుంచి కోలుకోగా… 28 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 5,21,129 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 14,307 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.03కి తగ్గింది. ఇప్పటి వరకు 4,24,89,004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.76కి పెరిగింది. ఇప్పటి వరకు 1,84,06,55,005 డోసుల వ్యాక్సిన్ వేశారు. నిన్న ఒక్కరోజే 22,27,307 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/