122 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లుకు కరోనా!

బాధితులంతా ఢిల్లీలోని 31వ బెటాలియన్ కు చెందినవారు

crpf-jawans

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిలీల్లో 122 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కాగా వీరంతా కూడా 31వబెటాలియన్ కు చెందినవారు. మరో 100 మందికి సంబంధించిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే, పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మందికి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. కరోనా బారిన పడిన వారిని మండోలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సెలవులపై ఊరికి వెళ్లొచ్చిన ఓ కానిస్టేబుల్ వల్లే బెటాలియన్ లోని ఇతరులకు వైరస్ సోకిందని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో బెటాలియన్ ప్రాంతాన్ని నిర్బంధంలో ఉంచారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/