12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
మహారాష్ట్రలో జేజేమార్గ్ పోలీసులకు కరోనా ..40 మంది సెల్ఫ్ క్వారంటైన్
ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విసృతంగా వ్యాపిస్తుంది. తాజాగా జేజే మార్గ్ పోలీస్ స్టేషన్కు చెందిన 12 మంది పోలీసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఆరుగురు ఎస్సైలు ఉన్నారు. 12 మందిలో 8 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ కరోనా లక్షణాలు బయటపడలేదని (అసింప్టమాటిక్) అని తేలింది. దీంతో పోలీసుల బాధిత కుటుంబ సభ్యులు సహా 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్కు తరలించినట్టు ఏసీపీ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/