తెలంగాణ కొత్తగా 1,196 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,53,651..మొత్తం మృతుల సంఖ్య 1390

Corona cases in Telangana
Corona cases in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,196 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,745 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,53,651 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,34,234 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1390 కి చేరింది. ప్రస్తుతం 18,027 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,205 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 192 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 121 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/