భారత్‌లో కొత్తగా 11,649 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589 ..మొత్తం మృతుల సంఖ్య 1,55,732

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11,649 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 9,489 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 90 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,732 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,21,220 మంది కోలుకున్నారు. 1,39,637 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 82,85,295 మందికి వ్యాక్సిన్ వేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/