మహారాష్ట్రలో మరో 116 మంది పోలీసులకు కరోనా

కరోనా బారిన పడిన మొత్తం పోలీసుల సంఖ్య 2,211

maharashtra police- corona

ముంబయి: కరోనా వైరస్‌ మహారాష్ట్రలో విలయతాండవం చేస్తుంది. తాజాగా మరో 116 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు రాష్ట్ర పోలీసు శాఖ శుక్రవారంనాడు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన మొత్తం పోలీసుల సంఖ్య 2,211కు చేరుకోగా, ఇంతవరకూ 25 మంది మృతి చెందారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, రాష్ట్రంలో ఇంతవరకూ 59,546 మంది కరోనా పాజిటివ్ బారిన పడగా, వీరిలో 18,616 మందికి స్వస్థత చేకూరింది. మృతుల సంఖ్య 1,982కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/