దేశంలో కొత్తగా 1,112 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీ : కరోనా రోజు వారీ కేసులు గత రెండు రోజులుగా వెయ్యికి దిగువనే నమోదైన కేసులు.. తాజాగా వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో 1,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,46,880కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,892 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 20,821 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,987 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.58 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.