ఎమ్మెల్సీలుగా 11 మంది వైస్సార్సీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం

అమరావతి: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది వైస్సార్సీపీ సభ్యులు ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఏకగ్రీవమైన నూతన ఎమ్మెల్సీలతో శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, తూర్పుగోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు), కృష్ణా జిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇక, ప్రకాశం జిల్లా నుంచి తుమాటి మాధవరావు, చిత్తూరు జిల్లా నుంచి భరత్, అనంతపురం జిల్లా నుంచి ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/