ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి
జోధ్పూర్: రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలో బలోత్రాఫలోడి జాతీయరహదారిపై ఈరోజు ట్రక్కుజీపు ఢీకొని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11మంది మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/devotional/