తంజావూరులో రథోత్సవంలో విద్యుదాఘాతం : 11 మంది భక్తుల సజీవ దహనం

తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవంలో కరెంట్ తీగలు తగిలి 11 మంది మృతి చెందారు. తంజావూరు పక్కనున్న కలిమేడు ఎగువ ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేడుకలో భాగంగా రథాన్ని లాగుతారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవం తెల్లవారుజాము వరకు జరుగుతుంది. గత రాత్రి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది.

ఈ క్రమంలో తంజావూరు-పుతలూరు రహదారి పక్కన రథం విద్యుత్ తీగకు తగిలి 11 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఫై మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మరణించినవారికి రెండు లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అలాగే గాయపడినవారికి 50 వేలు సాయం ప్రకటించారు. అలాగే తెలంగాణ సర్కార్ సైతం మరణించినవారికి 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది.