దేశంలో కొత్తగా 10,929 కరోనా కేసులు
మొత్తం మృతుల సంఖ్య 4,60,265
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా వల్ల 392 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కరోనా నుంచి 12,509 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,46,950 మంది చికిత్స తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 3,37,37,468 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,60,265కు పెరిగింది. నిన్న మొత్తం 20,75,942 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకు మొత్తం 1,07,92,19,546 డోసుల వ్యాక్సిన్ వినియోగించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/