ఏపిలో కొత్తగా 10,830 మందికి కరోనా

మొత్తం కేసులు సంఖ్య 3,82,469

corona virus -ap

అమరావతి: ఏపిలో కరోనా విజృంభణ కొనసాగతుంది. బుధవారం కొత్తగా 10,830 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,82,469కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 2,86,720 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 3,541 మంది మృతి చెందారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/