ఏపిలో కొత్తగా 10,820 కేసులు నమోదు
అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న కొత్తగా 10,820 కరోనా కేసులు నమోదయ్యాయి. 62,912 మంది శాంపిల్స్ పరీక్షించగా వీటిలో 10,820 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19తో తాజాగా 97 మంది మరణించారు. కరోనా నుంచి 9,097 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా కోవిడ్ మరణాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరులో 12 మంది, ప్రకాశం-11, చిత్తూరు-10, పశ్చిమ గోదావరి-10, అనంతపురం-8, కడప-8, శ్రీకాకుళం-8, కర్నూలు-7, తూర్పు గోదావరి-6, విశాఖపట్నం-6, కృష్ణ-4, నెల్లూరు-4, విజయనగరంలో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/