తెలంగాణలో కొత్తగా 1,058 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,834..మొత్తం మృతుల సంఖ్య 1,419
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1,058 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం… గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,440 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,834 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,46,733 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,419 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,682 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 10,352 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 91 కేసులు నిర్ధారణ అయ్యాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/