దేశంలో కొత్త‌గా 10,423 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య‌ 3,42,96,237

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 10,423 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, మ‌రో 15,021 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. నిన్న‌ 443 మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య‌ 3,42,96,237కు చేరింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,53,776 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,36,83,581 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,58,880కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,06,85,71,879 డోసుల వ్యాక్సిన్లు వేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/