తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,021 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,214 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,13,084 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,87,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,228 కు చేరింది. ప్రస్తుతం 24,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 228, రంగారెడ్డి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/