దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసుల నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 10,197 కేసులు వెలుగు చూడగా, 301 మంది కరోనాతో కన్నుమూశారు. 12,134 మంది కోలుకున్నారు. ఇక, క్రియాశీల కేసులు 1,28,555కు తగ్గి 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి.

గత 44 రోజులతో పోలిస్తే రోజువారీ పాజిటివ్ రేటు రెండు శాతం తగ్గి 0.82 శాతానికి చేరుకోగా, వారపు పాజిటివిటీ రేటు గత 54 రోజుల కంటే 2 శాతం తగ్గి 0.96 శాతంగా ఉంది. తాజాగా నమోదైన మొత్తం కేసులో దాదాపు సగం అంటే 5,516 కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. అలాగే, దేశవ్యాప్తంగా నమోదైన 301 మరణాల్లో 210 మంది కేరళలోనే మరణించడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కేసులు మరణాలను కలుపుకుంటే ఇప్పటి వరు దేశవ్యాప్తంగా 3.44 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 4,64,153 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇప్పటి వరకు 3.38 కోట్ల మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/