భారత్‌లో కొత్తగా 10,064 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,81,837..మొత్తం మృతుల సంఖ్య 1,52,556

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. దేశంలో గత 24 గంటల్లో 10,064 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 17,411 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,05,81,837కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,556కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,28,753 మంది కోలుకున్నారు. 2,00,528 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,78,02,827 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,09,791 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/