వైమానిక దాడి ..10 మంది మృతి
డమాస్కస్ : సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్లో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…తిరుగుబాటుదారుల జనాభా అధికంగా ఉన్న అరీహా నగరంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మృతి చెందారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/