తెలంగాణలో 9.4 ఏపిలో 10.6 రోజులు
కరోనా కేసులు రెట్టింపు అవడానికి పడుతున్న సమయం
హైదరాబాద్: కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దేశంలో కరోనా కేసులు రెట్టింపు అగుటకు అవుతున్న సమాయాన్ని అధికారికంగా ప్రకటించింది. జాతీయ సగటు 7.5 రోజులని. కేవలం వారం రోజుల్లోనే దేశంలో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నట్లు తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణలో కేసులు రెట్టింపు అవడానికి 9.4 రోజులు సమయం పడుతుండగా.. మరో తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రధేశ్లో ఈ సమయం 10.6 రోజులుగా ఉంది అని వెల్లడించింది. కాగా కేరళలో మాత్రం కరోనా కేసుల సంఖ్య రెటింపు అవడానికి 72.2 రోజుల సమయం పడుతుందని,అలాగే ఒడిశాలో 30 రోజులలో రెట్టింపు అవుతుందని తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/