సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన 7న టిఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన 7వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జర‌గ‌నుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించ‌నున్నారు.