వైరస్తో ప్రజలు కలిసి బతకాల్సిందే !
ఇది రేపో.. ఎల్లుండో వెళ్లి పోయే సమస్య కాదు
హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలు కరోనాతో కలిసి బతకాల్సిందేనని అన్నారు. దేశంలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు దీనికి ఇంకా మందు కనుగొనలేదు. ఇది ఈరోజో, రేపో సమసిపోయే సమస్య కాదు. వైరస్ తో ప్రజలు కలిసి బతకాల్సిందేనని అన్నారు. ఉపాయం ఉన్నోడు అపాయం నుంచి తప్పించుకుంటడు. కాబట్టి మనం ఉపాయంతో బతకాలి, ఆ తెలివి మనం సంపాదించుకోవాలి. ఇది రేపో.. ఎల్లుండో వెళ్లిపోయే సమస్య కాదు. ఇది మనల్ని వేటాడుతూనే ఉంటది. అని ముఖ్యమంత్రి అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/