వైయస్ఆర్సిపి నేతలకు హైకోర్టు నోటీసులు
వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డిజిపిని ఆదేశించిన హైకోర్టు
అమరావతి: ఏపిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘింస్తూ, కరోనా వ్యాప్తికి వైయస్ఆర్సిపి నేతలే కారణమవుతున్నారంటూ ఇటీవల హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. నోటీసులు జారీ అయిన వారిలో రోజా, విడదల రజని, వెంకట గౌడ్, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య లు ఉన్నారు, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో వారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, డిజిపిని హైకోర్టు ఆదేశించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/