వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

కుటుంబ సమేతంగా జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి దర్శనం

Governor Tamilisai Soundararajan

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కుటుంబ సమేతంగా ఈరోజు జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర తరపున ప్రజల గురించి స్వామివారిని ప్రార్ధించినట్టు తెలిపారు. కరోనా మహమ్మారి ఇప్పటిలో వెళ్లదని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అందరూ మాస్కులు వాడాలని.. భౌతిక దూరం పాటించాలన్నారు. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటకి రావాలని తమిళిసై ప్రజలకు సూచించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/