విదేశాల నుండి ఏపీకి వచ్చిన వారు మిస్సింగ్ ..వార్తల ఫై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

ఓమిక్రాన్ ..ఇప్పుడు ఈ పేరు వింటే ప్రజలు వణికిపోతున్నారు. మొన్నటి వరకు కరోనా తో భయపడిన జనాలు..ఇప్పుడు ఈ కొత్త వేరియంటెడ్ ఓమిక్రాన్ తో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదకర వైరస్ భారత్ లో ఎంట్రీ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం తో అన్ని రాష్ట్రాలు విదేశాల నుండి వచ్చే వారిపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో విదేశాల నుండి ఏపీకి వచ్చిన 30 మంది మిస్సింగ్ అంటూ సోషల్ మీడియా లో వార్తలు షికార్లు చేయడం తో అంత ఖంగారు పడుతున్నారు. ఈ తరుణంలో ఈ వార్తల ఫై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ స్పందించారు.

విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 30మంది ఆచూకీ దొరకడం లేదని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ఎపీలో అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవని.. విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రంలో దిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం టెస్ట్ లు చేసిన అనంతరమే పంపుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎయిర్ పోర్టులలో కూడా మెడికల్ టీం లు, హెల్ప్ డెస్క్ లు ఉన్నాయని.. స్క్రీనింగ్, టెస్ట్ లు చేసిన తర్వాతనే పంపుతున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన విశాఖపట్నం, పరిసర జిల్లాలకు చెందిన ముప్పై మంది జాబితాను పంపిందని తెలిపారు. వారందరూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు… వారిని వైద్య బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని.. వందే భారత్ పధకం కింద విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రయాణికులను కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల సూత్రాల ప్రకారం పరీక్షలు చేసి పంపుతున్నామనీ పేర్కొన్నారు.