లాభాలలో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రోజు కూడా మన స్టాక్ మార్కెట్లు లాభాలలో ముగిశాయి. ఒకానొక సమయంలో 460 పాయింట్ల లాభం వరకు సెన్సెక్స్ వెళ్లినప్పటికీ, అనంతరం మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో, చివరికి 117.34 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 50731.63 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 28.60 పాయింట్ల లాభంతో 14924.25 వద్ద ముగిసింది.